నేడు, రేపు నమస్తే తెలంగాణ, వైఆర్పీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో
పర్యావరణ హితమే లక్ష్యంగా నమస్తే తెలంగాణ, వైఆర్పీ ఫౌండేషన్ మట్టి గణపతి విగ్రహాల పంపిణీకి శ్రీకారం చుట్టాయి. నల్లగొండ పట్టణంలో సోమవారం, మంగళవారం ఉదయం 10 గంటల నుంచి విగ్రహాల పంపిణీ జరుగనుంది. ‘మట్టి గణపతులను పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం’ అనే నినాదంతో ఈ కార్యక్రమం కొనసాగనుంది.