ఝరాసంగం, జూలై7: దినకర్మకు వచ్చిన బాధిత కుటుంబీకులపై దాడికి యత్నించిన ఘ టన ఝరాసంగం పోలీస్స్టేషన్ పరిధిలోని బర్దిపూర్ గ్రామం లో బుధవారం రాత్రి చోటుచేసుకున్నది. ఎస్సై రాజేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బర్దిపూర్ గ్రా మానికి చెందిన ఆవుటి జ్యోతి ఈనెల 1న పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నది. మృతురాలికి ఒక కుమారుడు ఉన్నాడు. గ్రామ పెద్దల సమక్షంలో రెండెకరాల భూమిని మృతురాలి కొడుకు పేరిట చేసేందుకు భర్త శివకుమార్ ఒప్పుకున్నాడు. బుధవారం జ్యోతి దినకర్మ ఉండడంతో బంధువులతోపాటు మృతురాలి తండ్రి గోపాల్, ఆయన కుటుంబ సభ్యులు వచ్చారు. శివకుమార్ బావ విఘ్నేశ్ హైదరాబాద్ నుంచి 15 మందిని వాహనాల్లో తీసుకుని బర్దీపూర్కు వచ్చాడు. ఈ సందర్భంగా మృతురాలి కొడుకుకు ఏమీ ఇచ్చేది లేదని, గోపాల్ను, ఆయన కుటుంబ సభ్యులను నిర్భందించాడు. బూతులు తిడుతూ మీ ప్రాణాలు తీస్తామంటూ బెదిరిస్తూ వారిపై దాడికి దిగాడు. మృతురాలి తండ్రి గోపాల్ ఫిర్యాదు మేరకు 15 మందిని అదుపులోకి తీసుకుని, వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.