ప్రజలే తన కుటుంబమని, అన్నిరంగాల్లో సిద్దిపేటలను మార్గదర్శకంగా నిలబెట్టానని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట అర్బన్ మండల పరిధి పొన్నాల గ్రామ శివారులోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ‘కేసీఆర్ ఉచిత టెట్ కోచింగ్ సెంటర్’ అభ్యర్థులతో ముఖాముఖీ నిర్వహించారు. రాష్ట్రస్థాయిలో 32శాతం ఉత్తీర్ణత వస్తే, కేసీఆర్ కోచింగ్ సెంటర్లో 84శాతం ఉత్తీర్ణత సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇదే స్ఫూర్తిని ఉద్యోగం సాధించే వరకు కొనసాగిం చాలని అభ్యర్థులకు పిలుపునిచ్చారు. త్వరలోనే డీఎస్సీ కోచింగ్ ప్రారంభిస్తామని, త్వరలో గ్రూప్-4 నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపారు.
– సిద్దిపేట అర్బన్, జూలై 6
సిద్దిపేట అర్బన్, జూలై 6 : సిద్దిపేటనే నా కుటుంబంగా భావించి అన్ని రంగాల్లో మార్గదర్శకంగా నిలబెట్టానని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. సిద్దిపేట అర్బన్ మండలంలోని పొన్నాల గ్రామ శివారులోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో కేసీఆర్ ఉచిత టెట్ కోచింగ్ సెంటర్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులతో ఆయన ముఖాముఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి లో 32 శాతం ఉత్తీర్ణత సాధిస్తే కేసీఆర్ కోచింగ్ సెంటర్లో 84 శాతం ఉత్తీర్ణత సాధించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో నిర్వహించిన ఏ కోచింగ్ సెంటర్లోనూ 84 శాతం ఉత్తీర్ణత రాలేదని, 618 మంది కోచింగ్ తీసుకుంటే 517 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. ఇదే స్ఫూర్తిని ఉద్యోగం సాధించేవరకూ కొనసాగించాలని అభ్యర్థులకు పిలుపునిచ్చారు. డీఎస్సీతో పాటు గురుకుల ఉపాధ్యాయులు, గ్రూప్ 4 లాంటి ఉద్యోగాల్లో కూడా పోటీపడొచ్చన్నారు. త్వరలోనే గ్రూప్ 4 నోటిఫికేషన్ రాబోతుందని, దానికి కూడా ఉచితంగా కోచింగ్ ఇస్తామన్నారు.అన్ని ఉద్యోగాలతో పాటు మళ్లీ డీఎస్సీ కోచింగ్ కూడా త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.
మీరు ఉద్యోగాలు పొంది అపాయిమెంట్ లెటర్ తీసుకున్న రోజే ఈ కోచింగ్కు సార్థకత ఉంటుందన్నారు. 1300 మంది కానిస్టేబుల్, ఎస్సీ ఉద్యోగార్థులకు ఉచితంగా కోచింగ్ ఇప్పించామన్నారు. ఈ సారి ఉద్యోగం సాధించిన వారు చాలా అదృష్టవంతులని, గతంలో కొత్తగా ఉద్యోగం పొందిన వారు కర్ణాటక బార్డర్లోని జిల్లాలకు వెళ్లేవారని, సీఎం కేసీఆర్ కొత్త రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకొచ్చి 95 శాతం ఉద్యోగాలు స్థానికులకు వచ్చేలా చేశారన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు కనీస అవగాహన లేకుండా జీవో 317ను రద్దు చేయాలని రాద్ధ్దాంతం చేశారన్నారు. అన్ని పోస్టులను ఒకే జిల్లాలో నింపితే నిరుద్యోగులకు అవకాశం ఉండదని 317 జీవో తెస్తే.. ఒక బాధ్యత లేకుండా జీవో రద్దు చేయాలని ధర్నా చేశారని మండిపడ్డారు. కేంద్రంలో సుమారు 16 లక్షల 50 వేలు ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని ఒక్కటి కూడా నింపలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో 1,50,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి 1,37,000 నింపామని, ఇప్పుడు 90 వేల ఉద్యోగాల నింపబోతున్నామన్నారు.బాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేస్తామన్నారు. సిద్దిపేట అంతా నా కుటుంబమని.. అలా భావించే నేను పని చేస్తానన్నారు. రాష్ట్రంలోనే బెస్ట్ ఫ్యాకల్టీ ద్వా రా త్వరలో డీఎస్సీ కోచింగ్ ఇప్పిస్తామన్నారు. కేసీఆర్ కోచింగ్ సెంటర్ను సమర్థవంతంగా నిర్వహించిన నిర్వాహకులు గోవర్ధన్రెడ్డి, శ్రీనివాస్, టెట్లో మంచి మార్కులు సాధించిన అభ్యర్థులను మం త్రి సన్మానించారు.