మెదక్ మున్సిపాలిటీ, జూన్ 30 : ఏండ్లు గడుస్తున్నా మున్సిపాలిటీలో ఇంటింటికీ మి షన్ భగీరథ తాగునీరు అందించరా? భగీరథ గుంతలు పూడ్చరా? అని కౌన్సిల్ సభ్యులు మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో మున్సిపల్ డీఈ మహేశ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ మున్సిపల్ సర్వసభ్య సమావేశం గురువారం చైర్మన్ చంద్రపాల్ అధ్యక్షతన నిర్వ హించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు, లిం గం, లక్ష్మీనారాయణగౌడ్, శంషున్నిసా బేగం, మేఘమాల మాట్లాడుతూ.. మిషన్ భగీరథ తాగునీరు కొన్ని ఇండ్లలోకి వస్తున్నాయని, కొన్ని ఇళ్లలోకి రావడం లేదన్నారు. డీఈ దృష్టికి సమస్య తీసుకొచ్చినా ఫలితం లేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రతిరోజూ నీటి సమస్యతో వార్డు ల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అంతేగాకుండా పైపులైన్ గుంతలు పూడ్చకపోవడంతో వానలు కురిసినప్పుడల్లా నీరు నిలిచి పెద్ద గుంతలుగా మారి ప్రమాదకరంగా మారుతున్నాయని, వెంటనే గుంతలను పూడ్చాలని కోరారు. గుంతలను గుర్తించి వెంటనే పూడ్చాలని డీఈని చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్ ఆదేశించారు.
ఇంజినీరింగ్, వాటర్ సైప్లె సిబ్బంది మధ్య సమన్వయ లోపం..
పుష్కలంగా నీరు ఉన్నా ఇంజినీరింగ్, వాటర్ సైప్లె సిబ్బం ది మధ్య సమన్వయం లేకపోవడంతో పట్టణంలో తాగునీటి సమస్య ఏర్పడుతున్నదని మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్ మండిపడ్డారు. ఒక ఇంట్లో భగీరథ నల్లా నీరు వస్తుంటే.. పక్కింటి వారికి భగీరథ నీరు రాదు.. ఈ సమస్యను పరిష్కరించేది ఎవరు? ఎన్నిసార్లు మీ దృష్టికి తెచ్చినా సమస్యను పరిష్కరించకుంటే ఎలా? అని డీఈని ప్రశ్నించారు. కొన్ని ప్రాంతాల్లో భగీరథ తాగునీరు వృథాగా వెళ్తుందని తెలిపారు. వెంటనే నీటి సమస్యను పరిష్కరించాలని డీఈని కోరారు. పాత నల్లా కనెక్షన్లను తొలిగించాలని, ఇంజినీరింగ్ అధికారు లు వార్డుల్లో పర్యటించి సమస్యలు తెలుసుకోవాలన్నారు.
వెంకటేశ్వరగార్డెన్ నుంచి ఔరంగాబాద్ వెళ్లేదారిలో లైటింగ్ సదుపాయం కల్పించాలని కౌన్సిలర్ కిశోర్ కోరారు.24వ వార్డులో రెండు విద్యుత్తు స్తంభాలను వేయించాలని కౌన్సిలర్ మేఘమాల విజ్ఞప్తి చేశారు. అంబేద్కర్ కాలనీ, రషీద్ కాలనీలోకి వర్షపునీరు రాకుండా చర్యలు చేపట్టాలని కౌన్సిలర్ సమీయొద్దీన్ కోరారు. వర్షకాలంలో సీజనల్ వ్యాధుల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని శానిటరీ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్కు సూచించారు. సమావేశంలో కమిషనర్ శ్రీహరి, కౌన్సిలర్లు జయరాజ్, శ్రీనివాస్, కృష్ణారెడ్డి, విశ్వం, సుంకయ్య, శేఖర్, లక్ష్మి, వనజ, శేకమ్మ, చందన, జయశ్రీ, నర్మద, రుక్మి ణి, సులోచన, గాయత్రి, ఏఈలు కిష్టయ్య, బాలసాయిగౌడ్, మెప్మా పీఆర్పీ సునీత, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.