రామాయంపేట, జూన్ 29 : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం నాణ్యమైన విద్యను కార్పొరేట్ స్థా యిలో అందిస్తుందని సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు భూమగారి నర్సాగౌడ్ అన్నారు. బుధవారం రామాయంపేట మండలం రాయిలాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు రాని విద్యార్థులను టీచర్లు, వార్డు సభ్యులు నేరుగా ఇంటి వద్ద కే వెళ్లి డప్పుచప్పుళ్లతో పాఠశాలకు తీసుకుని వచ్చారు. అనంతరం విద్యార్థుల తల్లితండ్రులతో పాఠశాలలో సమావేశం ఏర్పాటు చేసి సర్పంచ్ మాట్లాడారు. ప్రభుత్వం నాణ్యమైన విద్యాబోధనను ప్రభుత్వ స్కూళ్లలో అందించడానికి ‘మన ఊరు-మనబడి’ పథకాన్ని అమలు చేస్తుందన్నారు. సన్నబియ్యంతో కూడిన అన్నం, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, ఆంగ్ల మాధ్య మంలో విద్యను అందిస్తుందన్నారు. తల్లిదండ్రు లు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకే పంపాలనికోరారు. గ్రామస్తులంతా సహకరించి మనబడిని మనం కాపాడుకుందామన్నారు. కార్యక్రమంలో రాయిలాపూర్ ఎంపీటీసీ సార్గు భాగ్యమ్మ, ఉపసర్పంచ్ సత్తమ్మ, వార్డు సభ్యులు, గ్రామస్తులు సార్గు భిక్షపతి, అశోక్గౌడ్ తదితరులు ఉన్నారు.
– సోషల్ వర్కర్ శామార్తి రీటా, ఆనంద్ దంపతులు
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు తనవంతు సాయంగా నోట్బుక్స్ అందజేస్తున్నట్లు సోషల్ వర్కర్ శామార్తి రీటా, ఆనంద్ దంపతులు పేర్కొన్నారు. రామా యం పేట మండలంలోని సుతారిపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథ మికోన్నత పాఠశాలలో 1 నుంచి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు నోట్బుక్స్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాను స్వగ్రామంలో లేకున్నా పేదపిల్లలకు ఇతర మార్గాల్లో తమవంతు సాయం చేస్తామన్నారు. ప్రభు త్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు మెరుగైన విద్య లభిస్తుంద న్నారు. కార్యక్రమంలో హెచ్ఎం సాంగని యాదగిరి, టీచర్లు ఎడ్ల బాల్రెడ్డి, బాజ మమత, పాఠశాల సిబ్బంది ఉన్నారు.
చిలిపిచెడ్, జూన్ 29 : విద్యార్థులను సర్కార్ బడుల్లో చదివించాలని అంతారం గ్రామ సర్పంచ్ అశోక్గౌడ్ అన్నారు. అంతారం ప్రాథమిక పాఠశాలకు బాక్ల్ బోర్డు అందజేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ నరహరి, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.