తూప్రాన్/రామాయంపేట, ఫిబ్రవరి 28 : తూప్రాన్, రామాయంపేట మున్సిపాలిటీలతో పాటు మండలాల్లో సీహెచ్సీల్లోని వైద్యులు లక్ష్యానికి మించి పల్స్ పోలియో చుక్కల మందును వేశారు. మంగళవారం మూడో రోజూ కావడంతో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి చుక్కల మందు వేశారు. తూప్రాన్ పట్టణంతో పాటు మనోహరబాద్ మండలంలోని మొత్తం 14,659 ఇండ్లు ఉండగా అందులో 6336 చిన్నారులకు చుక్క మందు వేసినట్లు తూప్రాన్ ప్రభుత్వ వైద్యురాలు సంగీత తెలిపారు. రామాయంపేట మున్సిపల్, మండలంతో పాటు నిజాంపేట మండలంలో 5415 పై చిలుకు చిన్నారులకు చుక్కల మందును వేసినట్లు రామాయంపేట ప్రభుత్వ వైద్యురాలు ఎలిజబెత్రాణి పేర్కొన్నారు.
మొత్తం రెండు మున్సిపాలిటీల్లో అనుకున్న దానికంటే ఎక్కువగా చుక్కల మందును వేశారు. రామాయంపేట, నిజాంపేట మం డలాల వ్యాప్తంగా 108శాతం పూర్తయిందన్నారు. రెండు మున్సిపాలిటీలలో ప్రభుత్వం పెట్టిన టార్గెట్కంటే ఎక్కువమంది చిన్నారులకు ఆరోగ్య సిబ్బంది చుక్కల మందును వేయడంతో జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్రావు రెండు మున్సిపాలిటీల వైద్యులకు, ఆరోగ్య సిబ్బంది, ఆశ వర్కర్లకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఈవోలు కరిపె రవీందర్, బాలనర్సయ్య, సూపర్వైజర్లు పల్లవి, శారద, ఉజ్వల, సునంద, పీహెచ్ఎన్ఎం సత్తమ్మ పాల్గొన్నారు.