మనోహరాబాద్/ పెద్దశంకంపేట/ నర్సాపూర్, జూలై 5 : టీఆర్ఎస్ పార్టీ దేశంలోనే బలమైనదని, విపక్షాలు ఉనికి కోసమే రాజకీయాలు చేస్తున్నాయని జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్గౌడ్ పేర్కొన్నారు. పార్టీ కోసం పని చేసే ప్రతి నాయకుడు, కార్యకర్తలకు తగిన సమయంలో గుర్తింపు ఇవ్వడంతోపాటు ఆపదలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ నాయక త్వం ఆదుకుంటుందన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో టీఆర్ఎస్ నాయకుడు మహేశ్యాదవ్ మృతి చెందాడు. మృతుడికి పార్టీలో సభ్యత్వం ఉండటంతో రూ. 2 లక్షల బీమా మంజూరైంది. బీమా చెక్కును బాధిత కుటుంబానికి మంగళవారం మనోహరాబాద్లో జడ్పీ చైటపర్సన్ అందజేశారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేకే ఉనికిని చాటుకునేందుకు ప్రతిపక్షాల నేతలు పగటివేశాలు వేస్తున్నారన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పురం మహేశ్ ముదిరాజ్, వైస్ ఎంపీపీ విఠల్రెడ్డి, నాయకులు మన్నె శ్రీనివాస్, నాగరాజు, వెంకట్గౌడ్, సతీశ్చారి, దామోదర్రెడ్డి, వెంకటచారి, నరేందర్, భిక్షపతి, సుధాకర్, శైలేందర్ తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటామని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. పెద్దశంకరంపేట మండలం టెంకటి గ్రామానికి చెందిన జింకల కాశీరాం, వీరోజిపల్లికి చెందిన అవుసుల రామకృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మృతుల కుటుంబీలకు రూ.2లక్షల బీమా చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో ఎం పీపీ శ్రీనివాస్, జడ్పీటీసీ విజయరామరాజు, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు సురేశ్గౌడ్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు కుంట్ల రాములు, పీఎసీఎస్ వైస్ చైర్మన్ సువర్ణాఅంజయ్య, ఎంపీటీసీలు వాణీసుభాశ్గౌడ్, స్వప్నా రాజేశ్వర్, సర్పంచ్లు సత్యనారాయణ, రుక్కుం బాయి, సుధాకర్, తహసీల్దార్ చరణ్ ఉన్నారు.
ఆపద సమయాల్లో కార్యకర్తల కుటుంబా లను ఆదుకుం టామని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి పేర్కొన్నారు. నర్సాపూర్ మండ లం రుస్తుంపేట్ గ్రామానికి చెందిన బోయి శేఖర్ ఇటీవల మృతి చెందాడు. శేఖర్కు మం జూరైన రూ.2 లక్షల బీమా చెక్కును హైదరా బాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో శేఖర్ తల్లి లక్ష్మీకి అందజేశారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ శివకుమార్, టీఆర్ఎస్ రుస్తుంపేట్ గ్రామ టీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు భిక్షపతి, స్థానిక నాయకుడు సుధీప్ ఉన్నారు.