చేగుంట, డిసెంబర్ 25 : పీడిత బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి కామ్రేడ్ కేవల్ కిషన్ జాతరను ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. కామ్రేడ్ కేవల్కిషన్ వర్ధంతి సందర్భం గా చేగుంట మండలం పోలంపల్లి శివారులోని కేవల్ కిషన్ సమాధి వద్ద జాతరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పీడిత ప్రజల విముక్తి కోసం భూస్వాములను ఎదిరించి భూ పంపి ణీ చేయడంలో కీలక పాత్ర పోషించారు. కేవల్ కిషన్ మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం తుర్కల మందాపూర్లో 7 నవంబర్ 1922లో జన్మించాడు.
తల్లిదండ్రులు మున్నాబాయి, నారాయణ. అప్పటిలోనే ఉన్నత చదువులు చదువుకున్న కుటుంబం. తండ్రి పట్వారీగా పని చేశారు. కేవల్ కిషన్ 1939లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఏ, బీ హాస్టళ్లలో తీవ్ర నిర్బంధం ఎదురైంది. కిషన్ చదువుతూనే ప్రజలకు స్వేచ్ఛ, నిరంకుశ రాజరికం నుంచి విముక్తి తన జీవిత ధ్యేయమని పేర్కొంటూ పోరాట పంథాలో నడిచారు. స్త్రీ విద్య కోసం ప్రత్యేక కృషి చేశారు. కిషన్కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసిన స్థానిక భూస్వాములు ఆయనపై కక్ష పెంచుకున్నారు. భవిష్యత్లో కిషన్ తిరుగులేని నాయకుడిగా మారే అవకాశం ఉందని, భూ స్వాములు ఏకమయ్యారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కమ్యూనిస్ట్టు పార్టీల అభ్యర్థుల తరుపున గ్రామాల్లో ప్రచారం నిర్వహించి, అర్ధరాత్రి ఇంటికి తిరిగి వస్తున్నా డు. డిసెంబర్26న చేగుంట మండలం పోలంపల్లి గేటు వద్ద కేవల్ కిషన్ ప్రయాణిస్తున్న మోటర్సైకిల్ను స్థానిక భూస్వాములకు చెందిన లారీతో ఢీకొట్టించారు. మోటర్సైకిల్ నడుపుతున్న సాలె లక్ష్యతో పాటు కిషన్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ కేసులో లారీ డ్రైవర్ జైలుశిక్ష అనుభవించి, విడుదలయ్యాడు.
జైలుశిక్ష సమయంలో లారీడ్రైవర్ తీవ్ర మనస్తాపం చెందేవాడు. జైలు నుంచి విడు దలయిన మరుక్షణమే ఆత్మహత్య చేసుకున్నాడు. నాటి నుంచి కేవల్ కిషన్ దేవుడి రూపంగా భావించి ఆయన మృతి చెందిన స్థలంలోనే డిసెంబర్ 26న ప్రతిఏటా జాతర నిర్వహించి, ఎడ్లబండ్లను ఊరేగిస్తారు. కిషన్ సమాధి వద్ద అయన కుమార్తె, విశ్రాంత వైద్యవిధాన పరిషత్ చైర్ పర్సన్ వీణతోపాటు కుటుంబ సభ్యులు జాతరలో పాల్గొంటారు. కిషన్ జాతరకు తెలంగాణ ప్రభుత్వం ఎకరం స్థలం, స్మృతి వనం కేటాయించింది.
తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బండా ప్రకాశ్ ఎంపీ కోటాలో వేదిక నిర్మాణానికి రూ.5లక్షలు మంజూరు చేశారు. కిషన్ జాతరను ప్ర భుత్వం అధికారికంగా గుర్తించడంపై ముదిరాజ్ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం జరుగనున్న కిషన్ జాతరకు ప్రభుత్వం తరపున ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలంపల్లి సర్పంచ్ నిర్మలాసత్యం తెలిపారు.