శ్రీనగర్ : కొవిడ్-19 కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో మహమ్మారి కట్టడికి జమ్ము కశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం వరకూ కరోనా కర్ఫ్యూ అమల్లో ఉంటుందని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పేర్కొన్నారు. కర్ఫ్యూ సమయంలో నిత్యావసరాలు, ఎమర్జెన్సీ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
అన్ని రకాల మార్కెట్లు, వాణిజ్య సంస్ధలు, దుకాణాలు మూతపడతాయని సిన్హా ట్వీట్ చేశారు. మరోవైపు వారాంతంలో మార్కెట్ల మూసివేతకు జమ్ము ట్రేడర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడికి ప్రభుత్వానికి సహకరించేందుకు తాము ఇలా ముందుకొచ్చామని వ్యాపారులు తెలిపారు.