మరికల్, నవంబర్ 28 : మండల సమావేశంలో ప్రజాప్రతినిధులు సమస్యలు ప్రస్తావిస్తే పెడచెవిన పెట్టి, పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడమేమిటని, మండల సమావేశానికి నివేదికలు కూడా కొందరు ఇవ్వడం లేదని, కొందరు ఇచ్చినా ఆసంపూర్తిగా ఉంటున్నాయని ఎంపీపీ శ్రీకళ ఆధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం ఎంపీపీ శ్రీకళారాజవర్ధన్రెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమస్యలు సమస్యలుగానే ఉండడంతో ఎంపీపీ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు చెప్పే సమస్యలు ఆధికారులు నోట్ చేసుకొని పరిష్కారానికి కృషి చేయాలన్నారు. జి న్నారం, ఎలిగండ్ల పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొ రత ఉందని, సభ్యులు సభ దృష్టికి తేగా డీఈవో కు సమస్యను వివరిస్తామని ఎంపీపీ తెలిపారు.
ఇబ్రహీంపట్నం, వెంకటపూర్ గ్రామాల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో మధ్యాహ్న భోజనం చేయడానికి ఎవరూ ముందుకు రావ డం లేదని క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఆ యా గ్రామాల సర్పంచులు బాధ్యత తీసుకొని అంగన్వాడీ ఆయాలతో వంటలు వండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మండలంలో రైతు లు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కోసం ఈకేవైసీ చేయించుకునేలా సర్పంచులు, ఎంపీటీసీలు రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. బ్యాంక్ ఆధికారులు రైతులను వేధిస్తున్నారని, రైతుల ఖాతాలను బ్లాక్ చేస్తున్నారని పల్లెగడ్డ సర్పంచ్ ఆంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 25 వేల వరకు మాత్రమే రుణ మాఫీ జరిగిందని, 50 వేలు తీసుకున్న రైతులకు ఎందుకు రుణమాఫీ కాలేదని ప్రశ్నించారు. మండల కేంద్రంలో పంచాయతీ భవనం తాసిల్దార్ కార్యాలయానికి ఇవ్వడంతో గ్రామ పంచాయతీ సబ్ సెంటర్లో నిర్వహిస్తున్నామని, వైద్యశాఖవారు భవనం కావాలని ఆడుగుతున్నారని, ఉన్న భవనం కూడా పెచ్చులు ఊడుతుందని సర్పంచ్ కస్పే గోవర్ధన్ ప్రస్తవించారు.
జిన్నారం గ్రామపంచాయతీలోని మట్టిరాలతండాకు విద్యుత్ స్తంభాలు కావాలని మక్తల్ ఎమ్మెల్యే చెప్పినా ఆధికారులు నిర్లక్ష్యంచేసున్నార ని ఎంపీపీ విద్యుత్ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికల్, ఎక్లాస్పూర్, మాధవరం గ్రామాలకు 100 స్తంభాలు ఆవసరమని సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు అధికారులను కోరారు. ఆబ్కారీ, ఆయుర్వేదిక్ శాఖాధికారులు సభకు రావడంలేదని వారిపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని ఎంపీపీ అన్నారు. సమావేశంలో వైస్ ఎంపీపీ రవికుమార్యాదవ్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ సంపత్కుమార్, ఎంపీడీవో యశోదమ్మతోపాటు సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు.