మహబూబ్నగర్ రూరల్, ఆగస్టు 9 : స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని వజ్రోత్సవాలు నిర్వహించడం సంతోషంగా ఉందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. వేడుకల్లో భా గంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలని మంత్రి పిలుపునిచ్చారు. మంగళవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఏవీడీ సినిమా థియేటర్లో విద్యార్ధుల కోసం ఉచితంగా ప్రదర్శించనున్న జాతిపిత మహాత్మాగాంధీ సినిమాను జ్యోతి ప్రజ్వలన చేసి మంత్రి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఆయన సినిమాను తిలకించారు. అలాగే మోనప్పగుట్టలో ఉన్న జ్ఞానభారతి పాఠశాల సమీపంలో ఇంటింటికీ వెళ్లి, విద్యార్థులకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటాన్ని మనం చూడలేదని, అదే స్ఫూర్తితో కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ పోరాటం చూశామన్నారు. ప్రపంచంలోనే జనాభాలో రెండో స్థానంలో ఉన్న మన దేశం సూ పర్ పవర్ అవ్వాల్సిన అవసరం ఉందన్నారు. చిన్న నాటి నుంచి ప్రతి ఒక్కరిలో జాతీయ భావన పెంపొందించుకోవాలని సూచించారు.
కులం, మతం పేరిట కొందరు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని, అలాంటి వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యా, వైద్యం, ఉపాధి రంగా ల్లో దేశం మరిన్ని అడుగులు వేయాలన్నారు. పేదరికం లేని భారత్గా అవతరిస్తేనే స్వా తంత్య్ర పోరాటయోధులకు మనమిచ్చే ఘనమైన నివాళి అన్నారు. తెలంగాణ నేత కార్మికులు తమారు చేసిన సొంత జెండాలు ప్రతి ఇంటికీ అందించడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. మన రాష్ట్రంతోపాటు 22 రాష్ర్టాలకు ఇక్కడి జెండాలనే అందించడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఇంటికీ జెండా చేరాలని, అందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, అడిషనల్ కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, సీతారామారావు, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న ముదిరాజ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్ యాదవ్, డీసీసీబీ వైస్ చైర్మన్ కొరమోని వెంకటయ్య, న్యాయవాది ప్రతాప్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్వర్, డీఈవో రవీందర్, డీఎస్పీ మహేశ్, కౌన్సిలర్ రాంలక్ష్మణ్, పీఆర్టీయూ నేత నారాయణగౌడ్, నాయ కులు పాల్గొన్నారు.