హైదరాబాద్ : నల్లగొండలో ఒకే ఇంట్లో నలుగురు మృతి చెందిన కేసులో మిస్టరీ వీడింది. నల్లగొండ జిల్లా కేంద్రం సాగర్ రోడ్డు తెలంగాణ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన మహమ్మద్ సుల్తాన్ (45), ఆయన భార్య హసీనా (40), కుమారుడు ముజమిల్(20), కుమార్తె అక్సర (11) అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హత్యకు గురైన హసీనా మొదటి భర్త కూతురు, అల్లుడు కలిసి సుపారీ గ్యాంగ్ చేత హత్య చేయించినట్లు నిర్ధారణ అయింది.
హసీనాకు గతంలో రెండు పెళ్లిళ్లు జరగగా.. నల్లగొండకు చెందిన మహ్మద్ సుల్తాన్ను మూడో వివాహం చేసుకుంది. సుల్తాన్కు కూడా గతంలో రెండు పెళ్లిళ్లు జరగగా.. సుల్తాన్ మొదటి భార్య పిల్లలు మహ్మద్ ముజమిల్, అప్సరతో కలిసి నల్లగొండలో జీవిస్తున్నారు. హసీనా పేరు మీద కోటి రూపాయల విలువైన స్థలాలు, ఇండ్లు ఉన్నాయి.
ఆ ఆస్తిని తమకు ఇవ్వకుండా తన మూడో భర్త అయిన సుల్తాన్ పిల్లల మీద వీలునామా రాస్తున్నట్లు హసీనా చెప్పడంతో కక్ష పెంచుకొని, హసీనా మొదటి భర్త కూతురు, అల్లుడు కలిసి హైదరాబాద్ పాతబస్తీకి చెందిన నలుగురు రౌడీ షీటర్ల చేత హత్య చేయించి పోలీసులు నిర్ధారించారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం.. సుల్తాన్ మృతదేహంపై 6 చోట్ల కత్తి గాయాలు ఉండగా, హసీనాకు 7 చోట్ల, కుమార్తె అక్సరకు 9 చోట్ల, ముజమిల్కు ఏకంగా 16 కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.