దేవరకద్ర, డిసెంబర్ 9: మండలంలోని చిన్నరాజమూరులో ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవం శుక్రవారం తెలవారుజామున వైభవంగా నిర్వహించారు. అంతకుముందు స్వామివారికి గజవాహనసేవ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలనుంచి తరలొచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు పలువురికి ఆకట్టుకున్నాయి. రథోత్సవానికి భక్తులు పెద్దఎత్తున తరలిరావడంతో జాతర మైదానం కిక్కిరిసిపోయింది. భక్తులు స్వామివారికి దాసంగాలు తయారుచేసి నైవేద్యం సమర్పించారు. మరికొంత మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్సై భగవంత్రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
చిన్నరాజమూరు ఆంజనేయస్వామికి గురువారం రాత్రి దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు అలయ అర్చకులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే స్వామివారికి పూజులు చేయగా అర్చకులు వేదమంత్రోచ్చారణలతో ఆశీర్వదించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు జెట్టి నర్సింహారెడ్డి, నాయకులు శ్రీకాంత్యాదవ్, కొండ శ్రీనివాస్రెడ్డి, ఉప్పరి సత్యం సాగర్, శంకర్, కృష్ణారెడ్డి, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.