పుదుచ్చేరి: పుదుచ్చేరిలో ఉత్కంఠకు మాజీ ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి సారథ్యంలోని ఏఐఎన్ఆర్సీ తెరదించింది. బీజేపీ, అన్నాడీఎంకేలతో ఆ పార్టీ ఎన్నికల పొత్తు కుదుర్చుకుంది. మొత్తం 30 స్థానాల్లో ఏఐఎన్ఆర్సీ 16 స్థానాల్లో పోటీ చేస్తుంది. మిగిలిన 14 స్థానాల్లో బీజేపీ, అన్నాడీఎంకే పోటీ చేస్తాయి. ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేయాలో ఇరు పార్టీలు నిర్ణయించుకుంటాయి. ఈ కూటమి సీఎం అభ్యర్థి ఎవరనేది ఎన్నికల తర్వాత నిర్ణయిస్తామని బీజేపీ తెలిపింది.