Koti Lingala | ప్రపంచ సాహితీ నందనవనంలో వికసించిన తొలి కథాగ్రంథ కుసుమం బృహత్కథ. ఇది పురుడు పోసుకొన్న నేల తెలంగాణ ప్రాంతం జగిత్యాల జిల్లాలోని కోటిలింగాల పుణ్యక్షేత్రం కావడం తెలంగాణ వారందరికీ గర్వకారణం. అది కోటిలింగాలను రాజధానిగా చేసుకొని శాతవాహన ప్రభువులు తెలుగుజాతి ఖ్యాతిని ఖండఖండాంతరాలకు వ్యాపింపజేస్తున్న కాలం. ఆ వంశ ప్రభువుల్లో 17వ వాడైన హాలుడు గొప్ప సాహిత్యాభిమాని. కవివత్సల బిరుదాంకితుడు. అంతేకాదు, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గాథాసప్తశతి సంకలనకర్త. అయితే ఆయన పరిఙ్ఞానం నాటి వాడుక భాషగా పిలువబడే ప్రాకృతానికి మాత్రమే పరిమితమైంది, సంస్కృతంతో ఆయనకంతగా పరిచయం లేదు. ఇక ఆయన పట్టమహిషి మాత్రం సంస్కృత భాషలో విద్వాంసురాలు.
అయితే ఆరు మాసాల్లో సంస్కృతం నేర్పడం సాధ్యం కాదు కాబట్టి, శర్వవర్మ సరస్వతిదేవిని ఆరాధించి ఆమె అనుగ్రహంతో ప్రభువును సంస్కృతంలో ప్రావీణ్యుణ్ణి చేస్తాడు. దీనితో ప్రభువు శర్వవర్మను మహోపాధ్యాయుడిగా పేర్కొని గౌరవిస్తాడు. పందెంలో పరాజితు డైన గుణాఢ్యుడు ఇక అక్కడ ఉండలేక తన మంత్రి పదవిని త్యజించి ఇద్దరు శిష్యులతో అడవుల్లోకి వెళ్లిపోతాడు. అక్కడ ఆయన ఒక పిశాచాల గుంపుతో స్నేహం చేస్తాడు. ఆ సాన్నిహిత్యంతో ఆయనకు పైశాచిక భాషలో ప్రావీణ్యం కలుగుతుంది. ఆ గుంపు లో కాణభూతి అనబడే పిశాచం కూడా ఉంటుంది. వాస్తవంగా కాణభూతి శాపగ్రస్థుడైన ఒక యక్షుడు. ఆయనకు ఎన్నో కథల పరిఙ్ఞానముంది. ఆ కథలన్నింటినీ కాణభూతి గుణాఢ్యుడికి నిరంతరంగా ఏడేండ్లు వినిపించి తన శాప విమోచనం పొందుతాడు.
ఒకరోజు ప్రభువు మహారాణితో కలిసి పక్కనే పారుతున్న గోదావరి నదిలో జలక్రీడకు ఉప క్రమించాడు. ఆ క్రీడలో ఒకానొక సందర్భంలో చిలిపి గా మహారాణి ముఖంపైకి నీళ్లను చిమ్మ సాగాడాయన. అయితే ఆ నీళ్ల తాకిడిని తట్టుకోలేని మహారాణి ‘రాజన్ మోదకైస్తాడయ-మోదకైస్తాడయ’ అంటూ వేడుకున్న ది. రాజా! నన్ను నీళ్లతో కొట్టవద్దని దానర్థం. అయితే సంస్కృత పరిజ్ఞానం అంతగా లేని ప్రభువులకు ఆమె ప్రార్థనలోని మోదకమన్న పదం మాత్రమే అర్థమైంది. మోదకమంటే మధుర పదార్థమైన ఉండ్రాళ్లు. దానితో మహారాణి ఉండ్రాళ్లని కోరుకొంటున్నదని భావించిన ప్రభువు బుట్టనిండా ఉండ్రాళ్లను తెప్పించి మహారాణికి అందించాడు. వాటిని చూసి మొదట విస్తుపోయిన మహారాణి కొద్దిసేపటికి తేరుకొని, ప్రభువుల సంస్కృత పరిజ్ఞానాన్ని పరిహసిస్తూ పకపకా నవ్వసాగింది. దానిని అవమానంగా భావించి ఖిన్నుడైన ప్రభువు సర్వ రాజ్య కార్యాలను త్యజించి విచారగ్రస్తుడై ఉంటాడు. ఈ విషయం తెలుసుకొని ఆస్థాన మంత్రులైన శర్వవర్మ, గుణాఢ్యుడు ఇద్దరూ కలిసి రాజమందిరం చేరుకొని ప్రభువు విచారానికి కారణం తెలియగోరుతారు.
విషయాన్నంతటినీ వివరించిన ప్రభువు, ఎట్టి పరిస్థితిలోను తాను సంస్కృతంలో ప్రావీణ్యం సాధించ వలెనని, అందుకు ఎంతకాలం పడుతుందని మంత్రులిద్దరిని అడుగుతాడు. దానికి గుణాఢ్యుడు సంస్కృతం కఠిన వ్యాకరణ దేవభాష కాబట్టి దానిలో ప్రావీణ్యం సాధించేందుకు కనీసం ఆరేండ్లు పడుతుందని చెప్తాడు. అది విన్న శర్వవర్మ హేళనగా నవ్వుతూ ప్రభువుకు ఆరు మాసాల్లోనే సంస్కృతం నేర్పుతానని చెప్తాడు.
దీనితో గుణాఢ్యుడు ఒకవేళ శర్వవర్మ ప్రభువుకు ఆరు మాసాల్లో సంస్కృతం నేర్పడం జరిగితే, తాను సంస్కృతంతో సహా, అన్ని భాషల్లోను రచనలు చేయ డం త్యజిస్తానని శపథం చేస్తాడు. దీనికి ప్రతిగా, ఒకవేళ తాను ఆరు మాసాల్లో ప్రభువుకు సంస్కృతం నేర్పలేక పోతే గుణాఢ్యుడి పాదుకల్ని పన్నెండేండ్లు తన తల మీద మోస్తానని శర్వవర్మ శపథం చేస్తాడు.
ఆ కథల్లోని విశిష్టతను గ్రహించిన గుణాఢ్యుడు వాటిని గ్రంథస్థం చేసేందుకు ఉపక్రమిస్తాడు. అయితే అడవిలో తాళపత్రాలు, గంటం లభ్యం కానందువల్ల తన రక్తంతో అక్కడి చెట్ల బెరడుల మీద ఏడు లక్షల శ్లోకాలతో పైశాచి భాషలో ఆ కథలను గ్రంథస్థం చేస్తాడు.
తాను రచించిన ఆ గ్రంథానికి బృహత్కథగా నామ మిడిన గుణాఢ్యుడు ఆ గ్రంథాన్ని రాజుకు పంపితే, అది రాజాదరణకులోనై ప్రజా బాహుళ్యంలో ప్రచా రంలోకి వస్తుందని భావించి, తన శిష్యులతో బృహ త్కథను రాజుకు పంపిస్తాడు. అయితే సంస్కృతంలో పండితుడై సంస్కృతాభిమానిగా మారిన ప్రభువు, పైశాచి భాషలో-అదీ రక్తంతో చెట్ల బెరడులపై రాయ బడిన ఆ గ్రంథాన్ని అసహ్యించుకొని గుణాఢ్యుడి శిష్యులను అవమానించి పంపుతాడు. ఆ శిష్యు లిద్దరూ ఆ గ్రంథాన్ని తీసుకొనివెళ్లి గుణాఢ్యుడికి ఆ విషయాన్ని వివరిస్తారు. దాని తో తీవ్ర అసంతృప్తికిలోనైన గుణా ఢ్యుడు ఏడేండ్ల తన శ్రమ వృథా గా మారిందని, తన బృహత్కథ ఒక వ్యర్థగీతంగా మారిందని భావించి, శిష్యులు వారిస్తున్నా వినకుండా ఆ గ్రంథాన్ని దహనం చేయడానికి సిద్ధమవు తాడు. అందుకని అడవిలోని ఒక పర్వతం మీద అగ్నిని జ్వలింపజేసి, బృహ త్కథలోని ఒక్కొక్క శ్లోకాన్నీ గట్టిగా చదువుతూ అవి రాసి ఉన్న బెరడు పత్రాలను అగ్నిలో దహనం చేస్తుంటాడు. ఆ గ్రంథ దహన సమయంలో అడవిలోని జంతువులు, పశుపక్ష్యా దులు, దహనస్థలికి చేరుకొని రోదిస్తూ ఉంటాయి. అందువల్ల అడవిలో ఒక్క జంతువు కూడా కనిపిం చదు. ఆ విషయం తెలుసుకొన్న ప్రభువు ఆశ్చర్యానికి లోనై, తానే స్వయంగా అడవికి వెళతాడు. అడవిలో జంతువుల అడుగుజాడలను అనుసరిస్తూ బృహ త్కథ దగ్ధస్థలికి చేరుకొని అక్కడి దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోతాడు.
జడలు కట్టిన జుట్టుతో, పెరిగిన గడ్డంతో, శల్య శరీరంతో, ఒక్కొక్క శ్లోకం గంభీరంగా చదువుతూ, గ్రంథపుటలను దహనం చేస్తున్న ఒక వ్యక్తి, ఆయన చుట్టూ చేరి రోదిస్తున్న లక్షలాది జంతువులు, పక్షులు, పక్కనే వాటితో పాటే రోదిస్తున్న శిష్యులు. ఆ దృశ్యం చూసి ప్రభువు చలించిపోతాడు. అంతేకాదు, ఆ వ్యక్తి ఎవరోకాదు, ఒకనాటి తన మంత్రి గుణాఢ్యుడని గుర్తిస్తాడు. పశ్చాత్తాప పడి, గుణాఢ్యుడి కాళ్లమీద పడి తన తప్పును క్షమించమని, ఆ గ్రంథాన్ని, దగ్ధం చేయవద్దని వేడుకుంటాడు. అంతేకాదు దాన్ని తనతో తీసికొని వెళ్లి జన బాహుళ్యంలో ప్రచారం చేస్తానని, అందు వల్ల ఆ గ్రంథాన్ని తనకివ్వమని అంటాడు.
అయితే, అప్పటికే బృహత్కథలోని ఆరులక్షల శ్లోకాలు అగ్నికి ఆహుతవుతాయి. గ్రంథంలోని కేవ లం ఏడవ వంతు భాగమే మిగిలింది. ఇక ప్రభువు లోని మార్పును గమనించిన గుణాఢ్యుడు, మిగిలిన ఏడవ భాగాన్ని ఆయనకు అందజేస్తాడు. రాజు ఆ శేష గ్రంథాన్ని అత్యంత గౌరవంగా కోటి లింగాలకు తీసు కొచ్చి, అ తర్వాత గుణాఢ్యుణ్ని ఆహ్వానించి ఆయన సహాయంతో బృహత్కథను సంస్కృతంలోకి అను వదింపజేసి జనబాహుళ్యంలో ప్రచారం చేయిస్తాడు.
పైశాచిక భాషలో గుణాఢ్య విరచిత మైన బృహత్కథ మనకిపుడు లభ్యం కావడం లేదు. కానీ, బృహత్క థని ఆధారంగా చేసుకొని సోమదేవ కవి రచించిన కథాసరిత్సాగరం, క్షేమేంద్రకవి రచించిన బృహత్కథా మంజరి, బృహ త్కథ లేని లోటుని పూరిస్తున్నాయి. వీటి ద్వారా బృహత్కథ వివిధ భాషల్లోకి అనువదించబడి తెలంగాణ ఖ్యాతిని ప్రపంచం నలుమూలలా వ్యాపింప జేస్తున్నది.
బసవరాజు, నరేందర్ రావు
9908516549