ఆధ్యాత్మిక ప్రవచనాలు పెద్దవాళ్లకే అనే భావన ఉంది. ప్రవచనాల దగ్గర వయసు మళ్లిన వాళ్లే ఎక్కువగా కనిపిస్తారు. ప్రవచనకర్తలూ పెద్ద వయసు వాళ్లే ఉంటారు. కానీ, రాజస్థాన్కు చెందిన జయ కిశోరి పాతికేండ్ల వయసులోనే ఆధ్యాత్మిక బావుటా ఎగురవేసింది. ‘అభినవ మీరాబాయి’గా గుర్తింపు తెచ్చుకుంది. భాగవతం, భగవద్గీత, మహాభారతంపై ఆమె ప్రవచనాలు యూట్యూబ్లో రికార్డు స్ట్రీమింగ్ నమోదు చేసుకుంటుంటాయి. కేవలం ప్రవచనకర్తగానే కాదు.. స్ఫూర్తినిచ్చే వక్తగానూ ఆమెకు సామాజిక మాధ్యమాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది.
‘ఐయామ్ జయ కిశోరి’ పేరుతో 2011లో జయ యూట్యూబ్ చానెల్ ప్రారంభించింది. రోజుల వ్యవధిలోనే దాదాపు 9 లక్షల మంది దానిని సబ్స్ర్కైబ్ చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె యూట్యూబ్ చానెల్ను 32.5 లక్షల మంది ఫాలో అవుతుండటం విశేషం. జయ చెప్పే స్ఫూర్తిదాయకమైన మాటలు గంటల్లోనే వైరల్ అవుతుంటాయి. ఆధ్యాత్మిక పథంలో సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తున్న జయ వయసు 28 ఏండ్లు మాత్రమే!