కొత్తగూడెం ఎడ్యుకేషన్/లక్ష్మీదేవిపల్లి/పాల్వంచరూరల్, డిసెంబర్ 3 : ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖరశర్మ అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కొత్తగూడెం భవిత కేంద్రంలో శనివారం జరిగిన వేడుకల్లో ఆయన మాట్లాడారు. దివ్యాంగులందరూ సాధారణ విద్యార్థులవలె సమాన విద్యావకాశాలను పొందాలని సూచించారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని శ్రీనగర్కాలనీ పంచాయతీ ఇందిరానగర్కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విభిన్న ప్రతిభావంతుల సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు గుండపనేని సతీశ్, దివ్యాంగుడైన పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ చాంద్పాషాను ఈ సందర్భంగా సత్కరించారు. పాల్వంచ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ సమీపంలోని భవిత ప్రత్యేక అవసరాల కేంద్రంలో ఎంఈవో శ్రీరామ్మూర్తి బాలలకు ప్లేట్లు, పలకలు, బాక్సులను అందించారు. కార్యక్రమంలో కో ఆర్డినేటర్ సైదులు, నాగరాజశేఖర్, తహసీల్దార్ రామకృష్ణ, ఏపీవో కిరణ్కుమార్, ఆర్సీలు శ్రీరాం, అరుణకుమారి, బ్రహ్మకుమారి సమాజం సభ్యులు, హెచ్ఎం జ్యోతిరాణి, సర్పంచ్ పూనెం నాగేశ్వరరావు, ఉప సర్పంచ్ లగడపాటి రమేశ్, ఎన్ఆర్ఐ దంపతులు ప్రమీల, నాగరాజశేఖర్, ఉపాధ్యాయులు ఇన్నయ్య, సరస్వతి, చలువాది ప్రకాశ్, జడ్పీ హెచ్ఎం రాజమౌళి, ఉపాధ్యాయులు దుర్గ, లక్ష్మి, ఫిజియోథెరపిస్టు జ్యోతి, కిశోర్కుమార్ పాల్గొన్నారు.