పినపాక, నవంబర్ 29: పినపాక మండలానికి కాంగ్రెస్ ముఖ్య నాయకుడొకరు టీ(బీ)ఆర్ఎస్లో చేరాడు. మరికొందరు నాయకులు, కార్యకర్తలు కూడా ఆయన బాటలోనే వచ్చి టీఆర్ఎస్లో చేరారు. దీంతో మండలంలో క్రమంగా టీఆర్ఎస్లోకి వలసలు పెరుగుతున్నాయి. ఈ మండలంలోని ఏడూళ్లబయ్యారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు గంగిరెడ్డి వెంకటేశ్వరరెడ్డితోపాటు ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీని వీడారు.
ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సమక్షంలో మణుగూరులోని ఆయన క్యాంపు కార్యాలయంలో మంగళవారం టీ(బీ)ఆర్ఎస్లో చేరారు. వారందరికీ ప్రభుత్వ విప్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులవుతున్న ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు తమ పార్టీలకు రాజీనామాలు చేసి టీ(బీ)ఆర్ఎస్లో చేరుతున్నారని వివరించారు. చేరిన ప్రతి ఒక్కరినీ పార్టీ కంటికి రెప్పలా కాపాడుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పగడాల సతీశ్రెడ్డి, ఎంపీపీ గుమ్మడి గాంధీ, పీఏసీఎస్ వైస్ చైర్మన్ బత్తుల వెంకటరెడ్డి, ముక్కు వెంకటనర్సారెడ్డి, యాంపాటి సందీప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.