ప్రస్తుతం మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్న విషయం తెలిసిందే. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు. సీఎంలు వంటి వారికే కరోనా పాజిటివ్గా నిర్ధారణ అవుతుంటే పరిస్థితి ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు. అయితే సినీ ఇండస్ట్రీకి సంబంధించి పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో పాటు సోనూసూద్ వంటి నటులు కూడా కరోనా బారిన పడ్డారు. మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్ల వ్యక్తిగత సిబ్బందికి పాజిటివ్గా నిర్ధారణ కావడంతో వీరు క్వారంటైన్కు వెళ్లారు.
మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట చిత్ర షూటింగ్ రెండో షెడ్యూల్ ఇటీవల మొదలు కాగా, చిత్ర బృందలోని నలుగురు వ్యక్తులతో పాటు మహేష్ సహాయకుడిగా ఉండే వ్యక్తికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందట. దీంతో షూటింగ్కు బ్రేక్ ఇచ్చి మహేష్తో పాటు కొందరు క్వారంటైన్కు వెళ్లినట్టు తెలుస్తుంది. ఇక ప్రభాస్ మేకప్ మ్యాన్కు కూడా కరోనా పాజిటివ్ రావడంతో ప్రభాస్ క్వారంటైన్లో ఉన్నారు. ఇక ఆచార్య చిత్రం కోసం రామ్ చరణ్, సోనూసూద్లపై ఇటీవల కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు కొరటాల. సోనూకు పాజిటివ్ అని తేలడంతో రామ్ చరణ్ కూడా క్వారంటైన్కు వెళ్లినట్టు సమాచారం. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ముగ్గురు హీరోలకు కరోనా పాజిటివ్ అని తేలడంతో అభిమానులు ఆందోళన చెందడంతో పాటు వారి ఆరోగ్యం గురించి ఆరాలు తీస్తున్నారు.