ఆర్కిటిక్ మంచుతో కప్పబడిన భూమి క్రమంగా వేడెక్కుతోంది. ప్రమాదకర కాంపౌండ్స్ ఈ ప్రాంతం అంతటా విడుదల కావచ్చనే ఆందోళన నెలకొంది. ఈ శతాబ్దం చివరినాటికి మంచు కరగడం, ప్రమాదకర రసాయనాల విడుదలతో గనులు మరియు పైప్లైన్ల వంటి 2,000 పారిశ్రామిక ప్రదేశాలలో నిర్మాణాలు అస్థిరతకు గురవుతాయని, ఇప్పటికే కలుషితమైన 5,000 కంటే ఎక్కువ ప్రదేశాలు మరింత ప్రమాదంలో పడతాయని నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్లో పరిశోధకులు స్పష్టం చేశారు. ఈ గణాంకాలు ఆర్కిటిక్ మంచు కరగడం వల్ల పారిశ్రామిక కలుషితాలను ఎక్కడ విడుదల చేయవచ్చనే దానిపై మొదటి పూర్తి విశ్లేషణపై ఆధారపడి ఉన్నాయని సైన్స్ న్యూస్ నివేదిక తెలిపింది. అయితే మనకు తెలియని ఇంకా ఎక్కువ కలుషితమైన ప్రదేశాలు ఉండే అవకాశం ఉందని జర్మనీలోని పోట్స్డామ్ ఆల్ఫ్రెడ్ వెజెనర్ ఇన్స్టిట్యూట్కు చెందిన నిపుణుడు మోరిట్జ్ లాంగర్ చెప్పుకొచ్చారు.
కరిగిపోయే శాశ్వత మంచు పర్యావరణంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. పర్యావరణంలోకి గ్రీన్హౌస్ వాయువుల విడుదల దాని అత్యంత హానికరమైన పరిణామాలలో ఒకటి. 2022 నాసా నివేదిక ప్రకారం మీథేన్, కార్బన్ డయాక్సైడ్తో సహా కేవలం ఆర్కిటిక్ మంచులోనే 1,700 బిలియన్ మెట్రిక్ టన్నుల కార్బన్ ఉందని అంచనా. కొలంబియా యూనివర్శిటీ 2022లో చేపట్టిన అధ్యయనం ప్రకారం, శాశ్వత మంచు వేడెక్కడం వల్ల వేలాది డోర్మాంట్ వైరస్లు, జెర్మ్స్ విడుదలవుతాయి. వాటిలో కొన్ని “కొత్త వైరస్లు పుట్టుకురావచ్చు, మరోవైపు మానవులకు రోగనిరోధక శక్తి లేని పురాతనమైనవి ఉండవచ్చని ఈ నివేదిక హెచ్చరించింది. ఇప్పటికే సమాజం నిర్మూలించిన మశూచి, బుబోనిక్ ప్లేగు వంటి వ్యాధులతో మానవాళికి పెనుముప్పు వాటిల్లవచ్చని పేర్కొంది.
Read More
Pak | కోల్మైన్ డీలిమిటేషన్ విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ.. 15 మంది దుర్మరణం..!