హనోయి: వియత్నాం(Vietnam) ప్రాపర్టీ టైకూన్, బిలియనీర్ త్రువాంగ్ మిలాన్కు మరణశిక్ష విధించారు. మల్టీ బిలియన్ డాలర్ ఫ్రాడ్ కేసులో ఆమెకు ఈ శిక్షను ఖరారు చేశారు. ఆ దేశంలోని ప్రఖ్యాత డెవలపర్ వాన్ తిన్ ఫట్ కంపెనీకి త్రువాంగ్ చీఫ్గా ఉన్నారు. గత దశాబ్ధ కాలం నుంచి సైగాన్ కమర్షియల్ బ్యాంక్(ఎస్సీబీ) నుంచి ఆమె పెద్ద మొత్తంలో క్యాష్ తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సుమారు 12.5 బిలియన్ల డాలర్లు బ్యాంకుల నుంచి తీసుకున్నట్లు ఆమెపై కేసు ఉన్నది. అయితే స్కామ్ మొత్తం అమౌంట్ దాదాపు 27 బిలియన్ల డాలర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ మొత్తం అమౌంట్ ఆ దేశ జీడీపీలో ఆరు శాతం అని తేలింది. ఈ ఫ్రాడ్ కేసులో అనేక మంది అధికారులు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. హాంగ్కాంగ్కు చెందిన సంపన్న వ్యాపారవేత్త ను మిలాన్ పెళ్లి చేసుకున్నది. అయితే అతను కూడా ఈకేసులో విచారణ ఎదుర్కొంటున్నారు. ఫేక్ లోన్ దరఖాస్తులతో ఎస్సీబీ బ్యాంకు నుంచి భారీగా డబ్బును విత్డ్రా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.