జెరుసలాం: ఇరాన్ రాజధాని టెహ్రాన్తో పాటు ఇతర మిలిటరీ కేంద్రాలపై గత రాత్రి ఇజ్రాయెల్ దాడలు చేసింది. అండర్గ్రౌండ్ బాలిస్టిక్ మిస్సైల్ ఫ్యార్టీతో పాటు ఓ మిలిటరీ అకాడమీపై దాడి చేసినట్లు ఐడీఎఫ్(IDF) వర్గాలు వెల్లడించాయి. ఇజ్రాయెల్ వైమానిక దళానికి చెందిన 80 ఫైటర్ విమానాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. ఆ జెట్స్ సుమారు 230 బాంబులను జారవిడిచినట్లు మిలిటరీ వర్గాలు పేర్కొన్నాయి. బాలిస్టిక్ క్షిపణులకు చెందిన స్టోరేజ్, ప్రొడక్షన్ కేంద్రాన్ని టార్గెట్ చేశామని, ఇక్కడ నుంచి ఇరాన్ సైన్యానికి చెందిన వేలాది మంది సైనికులు ఆపరేట్ చేస్తుంటారని ఐడీఎఫ్ చెప్పింది.
శుక్రవారం రాత్రి జరిగిన దాడి ప్రాంతంలో బంకర్లు ఉన్నాయని, మిలిటరీ హెడ్క్వార్టర్స్ కూడా ఉన్నట్లు ఐడీఎప్ పేర్కొన్నది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డు కార్ప్స్కు చెందిన మిలిటరీ అకాడమీ ఇమామ్ హుస్సేన్ యూనివర్సిటీపై కూడా దాడి చేసినట్లు ఐడీఎఫ్ వర్గాలు వెల్లడించాయి.