కీవ్: ఉక్రెయిన్పై యుద్ధానికి వెళ్లిన రష్యా ఆ దేశాన్ని ఆక్రమించేందుకు చాలా సమయం తీసుకుంటోంది. ఇప్పటికే ఇద్దరు సైన్యాధిపతులను కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఆగ్రహంగా ఉన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. యుద్ధంలో నష్టం రావడం వల్ల సుమారు ఎనిమిది మంది సైన్యాధిపతులను పుతిన్ తొలగించినట్లు ఓ నివేదిక స్పష్టం చేస్తోంది.
తమ దేశ ఇంటెలిజెన్స్ అధికారుల పట్ల కూడా ఆయన ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. వ్యూహాత్మక పొరపాట్లు జరిగిన నేపథ్యంలో ఫెడరల్ సెక్యూర్టీ సర్వీస్లో ఉన్న వారిపై పుతిన్ వేటు వేస్తున్నట్లు ఉక్రెయిన్ రక్షణ మంత్రి ఒలెక్సీ డనిలోవ్ తెలిపారు. ఉక్రెయిన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని చెప్పారు. ఇప్పటి వరకు 8 మంది మిలిటరీ జనరల్స్ను తొలగించినట్లు తెలిపారు.
యుద్ధ వ్యూహాన్ని కూడా ఆ దేశం మార్చినట్లు చెప్పారు. కొత్త వారిని నియమిస్తున్నారని, రష్యాలో ఏం జరుగుతోందో స్పష్టంగా అర్థం అవుతోందని, వాళ్లు ఆత్రుతతో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఉక్రెయిన్ ఐక్యంగా ఉన్నట్లు రష్యా అంచనా వేయలేకపోయిందన్నారు.