బ్రస్సెల్స్: వినియోగదారుల ఫోన్లో చార్జింగ్ తక్కువున్న సమయంలో ఉబెర్ సంస్థ తమ క్యాబ్ల ధర పెంచేస్తున్నదని బెల్జియంకు చెందిన ఓ పత్రికలో పరిశోధనాత్మక కథనం ప్రచురితమయ్యింది. ఒకే ట్రిప్లకు సంబంధించి వేర్వేరు వినియోగదారులకు వేర్వేరుగా ధరను ఉబెర్ చార్జ్ చేస్తున్నదని ఈ పత్రిక పేర్కొన్నది. తాము బ్రస్సెల్స్లోని పత్రిక కార్యాలయం నుంచి సిటీ సెంటర్కు 84 శాతం బ్యాటరీ, 12 శాతం బ్యాటరీ ఉన్న రెండు ఐఫోన్ల నుంచి ఉబెర్ క్యాబ్లు బుక్ చేసినట్టు ఈ కథనంలో పేర్కొన్నది.
ఈ రెండు బుకింగ్స్లో తక్కువ శాతం బ్యాటరీ ఉన్న ఫోన్ నుంచి బుకింగ్ చేస్తే ఉబర్ ఎక్కువ చార్జ్ చేసిందని సదరు పత్రిక వెల్లడించింది. అయితే యూజర్ల ఫోన్ ఛార్జింగ్ను తమ యాప్ చూడలేదని, డిమాండ్, డ్రైవర్ల అందుబాటు ఆధారంగా రైడ్ల ధర మారుతుందని ఉబెర్ వివరించింది.