టెన్నిసి: అమెరికాలోని టెన్నిసి రాష్ట్రంలో 30 ఏళ్ల క్రితం ఫ్రిజ్లో పెట్టిన అండాలతో కవల పిల్లలకు జన్మనిచ్చింది ఓ మహిళ. అత్యంత సుదీర్ఘ కాలం ఘనీభవించిన అండాలతో పిల్లలకు జన్మనివ్వడం చరిత్రలో ఓ కొత్త రికార్డుగా మారింది. ఏప్రిల్ 22, 1992 సంవత్సరంలో ద్రవరూప నైట్రోజెన్లో మైనస్ 128 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతల మధ్య ఆ అండాలను స్టోర్ చేశారు. రేచల్ రిడ్జ్వే అనే మహిళ ఆ అండాలతో కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఒరేగాన్కు చెందిన ఆమెకు అప్పటికే నలుగురు పిల్లలు ఉన్నారు. అక్టోబర్ 31వ తేదీన ఆ కవలలు జన్మించారు.
దానం చేసిన అండాల ద్వారా ఇప్పటి వరకు 1200 చిన్నారులు పుట్టినట్లు నేషనల్ ఎంబ్రియో డోనేషన్ సెంటర్ పేర్కొన్నది. అయితే అత్యంత సుదీర్ఘం కాలం ఘనీభవించిన అండాలతో పిల్లల్ని కనడం ఇదే తొలిసారి అని ఎన్ఈడీసీ పేర్కొన్నది. గతంలో మోలీ గిబ్సన్ అనే మహిళ 2020లో ఘనీభవించిన అండాలతో పిల్లలకు జన్మనిచ్చింది. 27 ఏళ్ల క్రితం నాటి అండాలతో ఆమె శిశువును కన్నది.
వివాహం చేసుకున్న జంట నుంచి ఐవీఎఫ్ టెక్నిక్ ద్వారా కవల అండాలను క్రియేట్ చేశారు. 2007 వరకు అమెరికా పశ్చిమ తీరంలోని ఓ ఫెర్టిలిటీ ల్యాబ్లో ఉన్న ఆ అండాలను టెన్నిసిలోని నాక్స్విల్లేలోని ఎన్ఈడీసికి డోనేట్ చేశారు.