బీజింగ్: చైనా కమ్యూనిస్టు నేత మావో జిదాంగ్ స్వయంగా రాసిన ఓ లేఖను చోరీ చేసిన కేసులో ముగ్గురికి రెండున్నర ఏళ్ల జైలు శిక్ష ఖరారైంది. మిలియన్లు ఖరీదు చేసే ఆ లేఖను ఆ దొంగలు చాలా తక్కువ ధరకు అమ్మినట్లు తెలుస్తోంది. దొంగల నుంచి మావో రాసిన లేఖను కొన్న ఓ వ్యక్తి దాన్ని రెండుగా చీల్చాడు. కమ్యూనిస్టు పార్టీ మీటింగ్, మావో రాసిన కవితలు ఆ లేఖలో ఉన్నట్లు గుర్తించారు. ఆ లేఖ ఖరీదు సుమారు 300 మిలియన్ల డాలర్లు ఉంటుందని భావిస్తున్నారు. 2020 సెప్టెంబర్లో ఫూ చున్జియావో ఆర్ట్ గ్యాలరీలో జరిగిన భారీ చోరీలో భాగంగా ఈ లేఖను ఎత్తుకువెళ్లారు. హో యిక్ చుయి, నాగ్ వింగ్ లున్, హుయి పింగ్ కేలు ఈ కేసులో అరెస్టు అయ్యారు.