న్యూఢిల్లీ: ఎవరైనా పెళ్లికి పిలిచేటప్పుడు వచ్చి నాలుగు అక్షింతలు వేసి ఆశీర్వదించి, భోజనం తిని వెళ్లండని పిలుస్తారు. మీ రాక మాకెంతో ఆనందం అంటారు. కానీ ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ మాత్రం చాలా వెరైటీ. ఆ ఇన్విటేషన్లో పెళ్లికి వచ్చే అతిథులకు కొన్ని రూల్స్ పెట్టడం విశేషం. ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లి వచ్చే వాళ్లు ఏం చేయాలి, ఏం చేయకూడదన్న రూల్స్ అందులో ఉన్నాయి. అతిథులెవరూ పెళ్లికూతురుతో మాట్లాడొద్దు.. కనీసం 75 డాలర్లు (రూ.5500) గిఫ్ట్ ఇవ్వాలి వంటి వింత వింత షరతులు పెట్టడం విశేషం.
అలా అయితేనే రండి..
ఓ వెడ్డింగ్ ప్లానర్ పెళ్లికి వచ్చే అతిథుల సంఖ్యను నిర్ధారించుకోవడానికి ఓ మెయిల్ పంపించారు. అందులోనూ పెళ్లిలో పాటించాల్సిన రూల్స్ను కూడా చెప్పారు. ఈ మెయిల్ను రెడిట్లో షేర్ చేయగా.. అది కాస్తా వైరల్గా మారింది. గుడ్ మార్నింగ్.. ఇది పెళ్లికి కచ్చితంగా ఎంత మంది వస్తారో తెలుసుకోవడానికి చేస్తున్న మెయిల్. ఇందులోనే కొన్ని నియమ నిబందనలు కూడా ఉన్నాయి. ముందుగా మీతో పాటు ఎవరైనా వస్తున్నారా చెప్పండి అని ఆ మెయిల్ను మొదలుపెట్టారు సదరు వెడ్డింగ్ ప్లానర్. ఇక రూల్స్ విషయానికి వస్తే..