లండన్: శిశువులకు పాలిచ్చే మహిళల ఫొటోలను అనుమతి లేకుండా తీయడాన్ని ఇంగ్లండ్, వేల్స్లో నేరంగా పరిగణించనున్నారు. సంతృప్తి కోసం కానీ, వారిని వేధించేందుకు కానీ జులాయిలు ఫొటోలు తీయకుండా నిరోధించేందుకే త్వరలో ఈ చట్టం తీసుకురానున్నట్టు న్యాయ శాఖ మంత్రి డొమినిక్ రాబ్ పేర్కొన్నారు. ఓ స్థానిక పార్కులో తనకు ఎదురైన చేదు అనుభవం ఎవరికీ ఎదురు కాకూడదనే ఉద్దేశంతో మాంఛెస్టర్కు చెందిన డిజైనర్ జూలియా కూపర్ దీనిపై క్యాంపెయిన్ ప్రారంభించారు.