ఒట్టవా : కెనడాలో తుపాను బీభత్సం సృష్టించింది. ఒంటారియో ప్రావిన్స్లో గడగడలాడించిన తుపాను ధాటికి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది నివాసాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. దీంతో చెట్లు, విద్యుత్ తీగలు నేలకొరిగాయి.
విద్యుత్ లేకుండా 3,50,000 మంది చీకట్లోనే ఉండిపోయారు. తుపాను కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని అధికారులు తెలిపారు. విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందన్నారు. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.