లండన్: 10 లక్షల డాలర్ల నగదున్న సూట్కేసును ఖతార్ షేక్ నుంచి తీసుకున్నట్లు ప్రిన్స్ ఛార్లెస్పై ఆరోపణలు వచ్చాయి. ఛారిటీ నిధుల్లో భాగంగా ప్రిన్స్ ఛార్లెస్ కు నగదు కట్టలతో నిండిన సూట్కేసును ఖాతార్ రాజకీయవేత్త ఇచ్చినట్లు ఇటీవల ఓ కథనం వచ్చింది. ఆ ఆరోపణలపై క్లారెన్స్ హౌజ్ విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఖతార్ మాజీ ప్రధాని షేక్ అహ్మద్ బిన్ జాసిమ్ బిన్ జాబర్ అల్ థానీ నుంచి ప్రిన్స్ ఛార్లెస్కు వ్యక్తిగతంగా పది లక్షల డాలర్ల నగదు ఉన్న సూట్కేసు అందిచనట్లు ఇటీవల సండే టైమ్స్ తన కథనంలో రాసింది. లండన్ డిపార్ట్మెంట్ స్టోక్కు చెందిన బ్యాగుల్లో నోట్ల కట్టలను పెట్టి ప్రిన్స్ ఛార్లెస్కు షేక్ అహ్మద్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 2015లో క్లెరెన్స్ హౌజ్లో జరిగిన భేటీ సమయంలోనూ ప్రిన్స్ ఛార్లెస్కు మిలియన్ డాలర్ల నగదు ఉన్న బ్యాగ్ ముట్టినట్లు సండే టైమ్స్ పేర్కొన్నది. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఛారిటెబుల్ ఫండ్ అకౌంట్లలో డబ్బు కూడా జమా అయినట్లు సండే టైమ్స్ తెలిపింది. మొత్తం సుమారు 30 లక్షల డాలర్లు ప్రిన్స్ ఛార్లెస్కు ముట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి.