ఐఎస్ఐ చీఫ్ అల్ ఖురేషీని తాము మట్టుబెట్టామని అమెరికన్ ప్రెసిడెంట్ జోబైడెన్ ప్రకటించిన విషయం తెలిసిందే. సిరియా నగరంలోని అట్మే నగరంలో అల్ ఖురేషీ నివాసంపై అమెరికా దళాలు దాడులు నిర్వహించాయి. అయితే అమెరికా దళాలకు చిక్కకుండా.. అల్ ఖురేషీ తన నివాసాన్ని బాంబులతో పేల్చేసుకున్నాడని మీడియా వెల్లడించింది. అయితే ఈ ఆపరేషన్ మొత్తాన్ని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ లైవ్ చూశారా? అమెరికా దళాలు చేసిన ఈ ఆపరేషన్ ప్రతి కదలికనూ జోబైడెన్ లైవ్లో చూసినట్లు వైట్హౌస్ అధికారులు పేర్కొంటున్నారు. అల్ ఖురేషీ ఆపరేషన్ను ప్రెసిడెంట్ జోబైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, రక్షణఫ మంత్రి లాయిడ్ ఆస్టిన్తో సహా పలువురు సీనియర్ అధికారులు లైవ్ చూశారని వైట్హౌస్ అధికారులు తెలిపారు. అమెరికా ప్రెసిడెంట్ సాయంత్రం 5 గంటలకు ముందస్తు షెడ్యూల్లో భాగంగా ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్యాన్యుయెల్ మైక్రోతో మాట్లాడారు. ఈ సమావేశం అయిపోగానే జోబైడెన్ నేరుగా సిచుయేషన్ రూమ్లోకే వచ్చేశారని, అక్కడి నుంచే లైవ్ చూశారని అధికారులు పేర్కొంటున్నారు. అమెరికా సైనికులు చేపట్టిన ఈ ఆపరేషన్లో సామాన్య పౌరులెవ్వరూ మరణించలేదని, మరణించిన వారందరూ ఐఎస్ఐఎస్ వారేనని తేల్చి చెప్పారు.
డిసెంబర్లోనే ప్లాన్ వేసిన అమెరికా..
ఐసిస్ చీఫ్ అల్ ఖురేషీని మట్టుబెట్టాలని అమెరికా డిసెంబర్ నుంచే అమెరికా ప్లాన్ వేసుకుంది. ఈ విషయాన్ని వైట్హౌజ్ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. అట్మే నగరంలోని ఓ మూడంతస్తుల భవనంలో అల్ ఖురేషీ నివసిస్తున్నాడని అమెరికా దళాలు గుర్తించాయి. అయితే అల్ఖురేషీని సజీవంగానే పట్టుకోవాలని అమెరికా సైన్యం భావించింది. అయితే అల్ఖురేషీ చాలా తక్కువ సందర్భాల్లో ఇంటి నుంచి బయటకు వస్తాడని, ఈ కారణంగానే సజీవంగా పట్టుకోవడం అమెరికా దళాలకు సాధ్యం కాలేదని తెలుస్తోంది.