బిష్కెక్: యుద్ధంలోని ప్రతి రోజూ మానవాళిని వెనక్కి నెట్టేస్తుందని, శత్రుత్వాన్ని అంతం చేసుకొనేందుకు కృషి చేయాలని ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్తో అన్నారు. బిష్కెక్లో సోమవారం జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సులో పుతిన్ను కలిసిన సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్తో ఉన్న విరోధాన్ని పరిష్కరించుకొనేందుకు చేసే అన్ని శాంతియుత ప్రయత్నాలకు భారత్ మద్దతు ఉంటుందని మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. మోదీ వ్యక్తిగత శ్రద్ధ కారణంగా రష్యా-భారత్ సంబంధాలు బలోపేతమవుతున్నాయని పుతిన్ అన్నారు.
ఇరాన్ అధ్యక్షుడితో భేటీ
ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్తో ప్రధాని మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పశ్చిమాసియా పరిణామాలు, ప్రాంతీయ శాంతి, భద్రతల గురించి ఇరువురు నేతలు చర్చించినట్టు తెలిసింది.