సక్సెస్ రేటు పెరిగిందన్న అమెరికా పరిశోధకులు
వాషింగ్టన్, జూలై 8: సంతానలేమితో బాధపడే వారికి శుభవార్త. గర్భాశయ మార్పిడితో సంతానం పొందేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్టు పరిశోధకులు తెలిపారు. అమెరికాలో ఇటీవల దాదాపు 33 మందికి గర్భాశయ మార్పిడి జరుగగా, వారిలో 19 మంది (58 శాతం) గర్భం దాల్చారని పేర్కొన్నారు.
వారు 21 మంది పిల్లలకు జన్మనిచ్చారని వెల్లడించారు. గర్భాశయంలో లోపాలున్న వారికి మార్పిడి చేయడం ద్వారా పిల్లలు కలిగారని డల్లాస్లోని బేలర్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్కు చెందిన డాక్టర్ లీజా జొహన్నెసన్ పేర్కొంటున్నారు.