మాడ్రిడ్: అప్పుడెప్పుడో తెలుగులో ఆదిత్య 369 మూవీ వచ్చింది తెలుసు కదా. అందులో సైంటిస్ట్ క్రియేట్ చేసిన ఓ టైమ్ మెషీన్లో హీరోహీరోయిన్లు గతంలోకి, భవిష్యత్తులోకి వెళ్లి వస్తారు. అలా తాజాగా ఓ టిక్టాక్ స్టార్ కూడా తాను గతంలోకి, భవిష్యత్తులోకి వెళ్లి వస్తుంటానని చెబుతున్నాడు.
అంతేకాదు ఈ మధ్యే తాను 2027లోకి వెళ్లి వచ్చాననీ చెబుతూ.. ఓ వీడియో కూడా పోస్ట్ చేశాడు. విచిత్రం ఏంటంటే.. ఆ ఏడాది కల్లా భూమి మీద తాను తప్ప ఎవరూ బతికి ఉండరట. కావాలంటే ఈ వీడియో చూడండి.. ఇది 2027లోకి వెళ్లినప్పుడు తీశాను. అప్పుడు రోడ్ల మీద, షాపింగ్ మాల్స్లో, పార్కుల్లో ఎవరూ లేరు. ఒక్క వీడియో తీస్తున్న నేను తప్ప అని ఓ 40 నిమిషాల నిడివి ఉన్న వీడియోను పోస్ట్ చేశాడు.
ఇప్పటి నుంచి కేవలం ఆరేళ్లలోనే భూమి మీది నుంచి మనుషులంతా మాయమైపోతారని జేవియర్ అనే ఆ టిక్టాక్ స్టార్ చెప్పాడు. ఇతినికి టిక్టాక్లో ఏకంగా 10 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ద సన్ ఈ వ్యక్తికి సంబంధించిన రిపోర్ట్ ప్రచురించింది.