ది హేగ్: మహమ్మారి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్నది. దీంతో వైరస్ వ్యాప్తిని నిలువరించడానికి ఆయా దేశాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో నెదర్లాండ్స్ ప్రభుత్వం అప్రమత్తమయింది. క్రిస్మస్ సందర్భంగా ప్రజలు ఎక్కువగా గుమికూడే అవకాశం ఉండటంతో దేశవ్యాప్తంగా కఠినమైన లాక్డౌన్ విధించింది. ఇది నేటినుంచి జనవరి రెండో వారం వరకు అమలులో ఉంటుందని ప్రధాని మార్క్ రూట్ తెలిపారు.
లాక్డౌన్ నేపథ్యంలో అత్యవసరం కాని దుకాణాలు, బార్లు, జిమ్లు, క్షౌరశాలలు, బహిరంగ వేదికలు మూతపడనున్నాయి. క్రిస్మస్ నేపథ్యంలో ఒక్కో ఇంటికి ఇద్దరు అతిథులకు మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు. జనవరి 9 వరకు పాఠశాలలు మూసిఉంటాయని, లాక్డౌన్ నిబంధనలు జనవరి 14 వరకు అమల్లో ఉంటాయని చెప్పారు.
ఒమిక్రాన్ వైరస్ ర్యాపిడ్ స్పీడ్తో వ్యాప్తిచెందుతుండటంతో యూరప్లోని అన్ని దేశాలు ఆంక్షలను కఠినతరం చేస్తున్నాయి. ఫ్రాన్స్, ఐర్లాండ్, జర్మని ఇప్పటికే ఆంక్షలు విధించాయి. యూరప్లో ఇప్పటివరకు 89 మిలియన్ల కరోనా కేసులు నమోదవగా, కోటీ 50 లక్షల మంది మహమ్మారికి బలయ్యారు.