విస్కన్సన్: అమెరికాలో గత ఏడాది ఇద్దర్నీ కాల్చి చంపిన 18 ఏళ్ల కైల్ రిట్టెన్హౌజ్ అనే వ్యక్తిని ఇవాళ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఆ తీర్పు పట్ల ఆదేశాధ్యక్షుడు బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2020 ఆగస్టు 25వ తేదీన కినోషాలో జరిగిన కాల్పుల్లో.. రిట్టెన్హౌజ్ అనే టీనేజర్ తన చేతిలో ఉన్న పిస్తోల్తో ఇద్దర్ని చంపేశాడు. ఒకర్ని గాయపరిచాడు. దానికి సంబంధించిన కేసులో రెండు రోజుల నుంచి విచారణ జరిగింది. తన ప్రాణాలు రక్షించుకునే ఉద్దేశంతో, ఆత్మరక్షణ కోసం జోసెఫ్, ఆంథోనీలపై కాల్పులు జరిపినట్లు రిట్టెన్హౌజ్ కోర్టుకు తలిపారు. అయితే అతనిపై నమోదు అయిన అన్ని కేసులను కోర్టు కొట్టిపారేసింది.
వాస్తవానికి రిట్టెన్హౌజ్ శ్వేతజాతీయుడే, అతని చేతుల్లో చనిపోయిన ఇద్దరు కూడా శ్వేతజాతీయులే. కానీ ఆ కాల్పుల ఘటన అమెరికాలో దుమారం రేపింది. దీంతో ఈ కేసుపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఓ నల్లజాతీయుడిపై కాల్పుల ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత అమెరికాలో గత ఏడాది అల్లర్లు చెలరేగాయి. ఆ సమయంలో రిట్టెన్హౌజ్ ప్రాణరక్షణ కోసం తన చేతుల్లో ఉన్న పిస్తోల్ను వాడాడు. శ్వేతజాతి దురహంకారానికి ఇదే నిదర్శమని గత ఏడాది రిట్టెన్హౌజ్కు చెందిన వీడియోను తన ట్వీట్లో బైడెన్ పోస్టు చేశారు. కానీ ఇప్పుడు తీర్పు రిట్టెన్కు అనుకూలంగా రావడంతో బైడెన్ కొంత మాటమార్చారు. ధర్మాసనం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని, జ్యూరీ చెప్పినట్లు వినాల్సిందే అని, కానీ కినోషా తీర్పు వల్ల చాలా మంది ఆగ్రహానికి గురయ్యారని, తనకు కూడా ఆ ఫీలింగ్ కలిగినట్లు బైడెన్ అన్నారు.