టోక్యో: జపాన్కు చెందిన ఆరోగ్యశాఖ మంత్రి నోరిహిషా తమురా క్షమాపణలు చెప్పారు. ఆ మంత్రిత్వశాఖకు చెందిన ఉద్యోగులు కోవిడ్ నిబంధనలు ఉల్లఘించి పార్టీ చేసుకోవడం పట్ల స్థానిక మీడియాలో కథనం వచ్చింది. లాక్డౌన్ ఆంక్షలను ఉల్లంఘించిన ఆ సిబ్బంది పట్ల క్షమాపణలు చెబుతున్నట్లు మంత్రి వెల్లడించారు. మార్చి 24వ తేదీన ఆరోగ్యశాఖకు చెందిన 23 మంది ఉద్యోగులు లేట్ నైట్ డిన్నర్లో పాల్గొన్నారు. అయితే ఆ అంశాన్ని విచారించనున్నట్లు ఆయన తెలిపారు. టోక్యోతో పాటు సమీప జిల్లాల్లో ఇటీవల ఎమర్జెన్సీ విధించారు. రాత్రి 9 గంటల తర్వాత రెస్టారెంట్లను ఓపెన్ చేయవద్దు అంటూ ఆదేశాలు కూడా ఉన్నాయి. భారీ సంఖ్యలో గుమ్మికూడడాన్ని కూడా నిషేధించారు. గింజా జిల్లాలో ఆరోగ్య శాఖ సిబ్బంది ఫేర్వెల్ పార్టీలో భాగంగా డిన్నర్ చేసినట్లు తెలిసింది. అయితే కొందరు రాత్రంతా ఆ రెస్టారెంట్లో ఉండడం వివాదానికి దారి తీసింది.