టెహ్రాన్, మార్చి 22 : ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం వల్ల పెద్ద మొత్తంలో గ్రీన్హౌజ్ వాయువులు విడుదలవుతున్నాయని, దీంతో ఈ భూమిపై మానవుడు బతకలేని పరిస్థితులు ఏర్పడతాయని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్లో 20 వేల భవనాలు ధ్వంసమయ్యాయని, దీని నుంచి 24 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ విడుదలైందని ‘ఇరానియన్ రెడ్ క్రెసెంట్’ నివేదిక అంచనా వేసింది.
దీని ప్రకారం, గత రెండు వారాల్లో ఇరాన్లో 50 లక్షల టన్నుల గ్రీన్హౌజ్ వాయువులు వాతావరణంలోకి విడుదలయ్యాయి. రోజంగా సాగుతున్న స్టెల్త్ బాంబర్లు, ఫైటర్ జెట్స్, నౌకా విన్యాసాలతో పెద్ద ఎత్తున వాతావరణ కాలుష్యం ఏర్పడుతున్నది. ఇరాన్లోని చమురు క్షేత్రాలపై దాడుల వల్ల 18.8 లక్షల టన్నుల కార్బన్డయాక్సైడ్ విడుదలైందని నివేదిక అంచనా వేసింది.