EU Envoy on Afghan | ఉగ్రవాద కార్యకలాపాలు జరిపేందుకు ఆఫ్ఘన్ భూభాగాన్ని వినియోగించకుండా చర్యలు చేపట్టాలని భారత్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) నిర్ణయించాయి. ఆఫ్ఘన్లో రోజువారీ పరిణామాలను సంయుక్తంగా నిశితంగా పరిశీలించాలన్న అభిప్రాయానికి వచ్చాయి. ఈ మేరకు ఈయూ ప్రత్యేక రాయబారి థామస్ నిక్లాస్సోన్.. విదేశాంగశాఖ కార్యదర్శి హర్ష్ శింఘ్లాతో సమావేశమయ్యారు. ఆఫ్ఘన్లో ప్రస్తుత పరిస్థితిపై వారిరువురు చర్చలు జరిపారు.
ఉగ్రవాదులు ఆఫ్ఘన్ తమ కార్యకలాపాల నిర్వహణకు వేదికగా ఉపయోగించకుండా చేయాల్సిన బాధ్యత తాలిబన్ల ఆధ్వర్యంలో ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వానిదే. అదే టైంలో క్షేత్రస్థాయిలో పరిణామాలను కూడా తాము పరిశీలిస్తామని థామస్ నిక్లాస్సోన్ చెప్పారు. ఆఫ్ఘనిస్థాన్లో పరిస్థితులపై ఆ దేశ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ఖాన్ ముత్తాఖీ సారధ్యంలోని తాలిబన్ల ప్రతినిధి బృందంతో దోహాలో చర్చలు జరిపిన తర్వాత నిక్లాస్సోన్ భారత్కు వచ్చారు.
గత ఆగస్టులో తాలిబన్లు అధికారం చేపట్టినప్పటి నుంచి ఆఫ్ఘనిస్థాన్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఈ పరిస్థితుల్లో ఆఫ్ఘన్లకు ప్రపంచ దేశాలు మానవీయ సహకారం అందించాల్సిన అవసరం ఉందన్నారు.