మెక్సికో ప్రభుత్వం ప్రపంచానికి చూపిన(సెప్టెంబర్లో) ఏలియన్స్ మమ్మీలకు సంబంధించి సరికొత్త విషయం బయటకు వచ్చింది. పెరూలో వీటిపై డీఎన్ఏ పరీక్షలు జరపగా, ఇవేవీ భూమిపై ఉన్న మానవుడు, ఇతర జీవరాశి డీఎన్ఏతో సరిపోలటం లేదని సైంటిస్టుల పరిశోధనలో తేలిందని జర్నలిస్టు జైమీ మాసన్ వెల్లడించారు.
గ్రహాంతరవాసులు భూమి పైకి వచ్చినట్టు ఇప్పటివరకు శాస్త్రీయ ఆధారాలు లేవు. కానీ రెండు నెలల క్రితం మెక్సికన్ పార్లమెంట్లో అక్కడి ప్రభుత్వం రెండు శవపేటికలను తీసుకొచ్చి, అందులో ఉన్నవి రెండు ఏలియన్స్ మమ్మీలుగా చూపింది. పెరూలో జరిపిన తవ్వకాల్లో ఇవి లభ్యమయ్యాయని, కొన్ని లక్షల సంవత్సరాల క్రితం నాటివిగా పేర్కొన్నది.