లండన్: ట్విట్టర్కు సరికొత్త రూపు తీసుకొస్తానన్న ఎలాన్ మస్క్ ట్విట్టర్ లోగో నుంచి పిట్టను తొలగించి ‘ఎక్స్’ను ఆవిష్కరించారు. శాన్ఫ్రాన్సిస్కోలో ట్విట్టర్ ప్రధాన కార్యాలయంపై కొత్త లోగో ఎక్స్ను ప్రదర్శించగా, ఈ ఫొటోను ఎలాన్ మస్క్ సోమవారం ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ట్విట్టర్ డాట్కామ్.. ఇక నుంచి ‘ద ఎక్స్.కామ్’గా రీడైరెక్ట్ చేస్తున్నట్టు మస్క్ ప్రకటించారు. నలుపు రంగు బ్యాక్గ్రౌండ్తో తెలుపు రంగులోని ‘ఎక్స్’ అనే గుర్తును మస్క్ ఎంచుకున్నారు. కంప్యూటర్లన్నింటిపైనా కొత్త లోగో కనిపించగా, మొబైల్ యాప్లో పాత లోగో.. పిట్ట కొనసాగటం గమనార్హం.
ట్విట్టర్ను కొనుగోలు చేసిన తర్వాత, దీనిని సమూలంగా మార్చేస్తానని మస్క్ ప్రకటించారు. లోగో సహా అనేక మార్పులుంటాయని చెప్పారు. కొత్త లోగోపై ట్విట్టర్ సీఈవో లిండా యకరీనా స్పందిస్తూ, ‘ఆడియో, వీడియో, మెస్సేజింగ్, బ్యాంకింగ్, చెల్లింపులకు భవిష్యత్తు వేదికగా నిలుస్తుంది. సరికొత్త ఆలోచనలకు, వస్తు సేవలకు, అవకాశాలకు గ్లోబల్ మార్కెట్ను సృష్టిస్తుంది’ అని పోస్ట్ చేశారు. ట్విట్టర్ను కొనుగోలు చేసిన తర్వాత ఎలాన్ మస్క్ నిర్ణయాలన్నీ బెడిసికొడుతున్నాయని విమర్శలున్నాయి. తాజా మార్పుకూడా అలాగే మారుతుందని ట్విట్టర్ యూజర్లు అభిప్రాయపడ్డారు. ఫేస్బుక్ తీసుకొచ్చిన కొత్త మెస్సేజింగ్ యాప్ ‘థ్రెడ్స్’ నుంచి ట్విట్టర్కు గట్టి పోటీ నెలకొంది.