జెరుసలాం: యూదులు, ముస్లింలకు పవిత్ర స్థలమైన అల్ అక్సా మసీదు వద్ద ఘర్షణలు జరిగాయి. జెరుసలాంలోని మసీదు కాంపౌండ్లోకి ఇజ్రాయిల్ భద్రతా దళాలు ప్రవేశించాయి. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో 117 మంది పాలస్తీనియన్లు గాయపడ్డారు. రంజాన్ నెల సందర్భంగా పాలస్తీనియన్ల ఆ మసీదు వద్ద గుమ్మిగూడారు. అయితే హింస జరుగుతుందో ఏమో అన్న భయంతో తెచ్చిపెట్టిన రాళ్లను తొలగించేందుకు ఇజ్రాయిలీ దళాలు వెళ్లాయి. రాళ్లు రువ్వుతున్న పాలస్తీనియన్లపై పోలీసులు టియర్ గ్యాస్ను ప్రయోగించిన వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది. ఈ ఘర్షణలో 117 మంది గాయపడ్డారు.