పారిస్: ఫ్రాన్స్కు చెందిన విలాసవంతమైన వస్తువుల బ్రాండ్ ఛానెల్కు సీఈవోగా భారతీయ సంతతి వ్యక్తి లీనా నాయర్ నియమితులయ్యారు. గతంలో ఆమె యునీలివర్ ప్రతినిధిగా ఉన్నారు. హిందుస్తాన్ యునీలివర్లో 30 ఏళ్ల క్రితం మేనేజ్మెంట్ ట్రైనీగా లీనా నాయర్ తన కెరీర్ను ప్రారంభించారు. ఆ కంపెనీ మేనేజ్మెంట్ కమిటీలో సభ్యురాలైన తొలి మహిళగా ఆమె నిలిచారు. ఇండియాలో పుట్టిన లీనా నాయర్కు బ్రిటన్లో పౌరసత్వం ఉన్నది. ఛానెల్ కంపెనీ లగ్జరీ వస్తువులకు చాలా ఫేమస్. సూట్లు, హ్యాండ్బ్యాగ్లు, పర్ఫ్యూమ్లకు ఛానెల్ పెట్టింది పేరు. బిలియనీర్ అలెయిన్ వెర్తిమేయర్ ఇప్పుడు ఆ కంపెనీ ఓనర్గా ఉన్నారు. కొన్నాళ్లు సీఈవోగా ఉన్న ఆయన ఇప్పుడు ఆ పదవి నుంచి తప్పుకున్నారు. 1910లో ఫ్యాషన్ లెజెండ్ గ్యాబ్రియెల్లీ కోకో ఛానెల్ ఆ కంపెనీని స్టార్ట్ చేశారు.