సిడ్నీ: రోజుకో గుడ్డు తింటే ఆరోగ్యం మన సొంతం.. అంతేకదా ఇప్పటివరకు మనకు తెలిసింది. అయితే రోజూ ఒకటి కంటే ఎక్కువ గుడ్లు తినడం వల్ల మధుమేహం బారిన పడుతామని తాజా అధ్యయనం చెబుతున్నది. రోజుకు 50 గ్రాముల కన్నా ఎక్కువ గుడ్లు తీసుకుంటే టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు 60 శాతం మేర ఉన్నాయని, పురుషుల కంటే మహిళల్లో ఈ ప్రమాదం మరీ ఎక్కువ ఉందని అధ్యయనం వెల్లడించింది. 1991 నుంచి 2009 వరకు చైనా మెడికల్ యూనివర్సిటీ, ఖతార్ యూనివర్సిటీలతో కలిసి యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.