ఒగడోగు: ఆఫ్రికా దేశం బుర్కినో ఫాస్లో రాజకీయ అనశ్చితి నెలకొన్నది. ఆ దేశ అధ్యక్షుడు రోచ్ కబోర్ను సైన్యం అరెస్టు చేసింది. రోచ్ పాలనను వ్యతిరేకిస్తూ అక్కడ కొన్ని దళాలు తిరుగుబాటుకు ప్రయత్నించాయి. మిలిటరీ చీఫ్లను తొలగించాలంటూ కొందరు సైనికులు డిమాండ్ చేశారు. ఇస్లామిక్ తీవ్రవాదులతో పోరాడేందుకు కూడా మరిన్ని అదనపు సౌకర్యాలు డిమాండ్ చేశారు. దేశ రాజధాని ఒగడోగులో ఉన్న అధ్యక్ష భవనం వద్ద ఆదివారం రాత్రి కాల్పుల శబ్ధాలు వినిపించాయి. సైనిక తిరుగుబాటు ఏమీ జరగలేదని, ప్రెసిడెంట్ను ఎవరూ అరెస్టు చేయలేదని ప్రభుత్వం పేర్కొన్నది. కానీ అధ్యక్షుడు కబోర్ను మిలిటరీ క్యాంపులో బంధించినట్లు విదేశీ మీడియా తెలిపింది. అధ్యక్షుడు తిరిగే వాహనాలకు బుల్లెట్ రంధ్రాలు ఉన్నట్లు గుర్తించారు. ఆ వాహనాలను వీధుల్లో వదిలేశారు. నగరాన్ని చుట్టుముట్టడంతో అక్కడ అంతా నిర్మానుషంగా ఉన్నట్లు విదేశీ మీడియా చెబుతోంది.