లండన్: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్(Rishi Sunak).. పార్లమెంట్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారు. భార్య అక్షత మూర్తికి .. చైల్డ్కేర్ కంపెనీలో షేర్లు ఉన్నట్లు ప్రధాని రిషి సునాక్ పార్లమెంట్కు వెల్లడించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై ఏప్రిల్లో పార్లమెంట్ కమిటీ విచారణ చేపట్టింది. చైల్డ్కేర్ పథకాలతో రిషి సునాక్ భార్యకు లబ్ధి చేకూరుతున్నట్లు విపక్షాలు ఫిర్యాదు చేసిన తర్వాత పార్లమెంటరీ కమిటీ దర్యాప్తు చేపట్టింది. ఆ కమిటీ చీఫ్ డేనియల్ గ్రీన్బర్గ్ విచారణ నిర్వహించారు. ఆయన తన నివేదికలో రిషి సునాక్ను తప్పుపట్టారు. సీనియర్ ఎంపీలకైనా ఆయన తన భార్య షేర్ల గురించి చెబితే బాగుండేదని ఆ రిపోర్టులో పేర్కొన్నారు. అనుకోకుండానే ఆ తప్పు జరిగినట్లు ఆయన తెలిపారు. అయితే కమిటీ ఇచ్చిన నివేదికను రిషి సునాక్ అంగీకరించారు. క్షమాపణలు కూడా తెలిపారు. దీంతో ప్రధాని రిషి సునాక్పై దర్యాప్తును ఆపేశామని, ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని గ్రీన్బర్గ్ చెప్పారు.