కరాచీ: పాకిస్థాన్లోని కరాచీ ప్రాంతంలో అంతుచిక్కని వ్యాధితో 18 మంది మృతి చెందారు. వీరిలో ఎక్కువగా పిల్లలు ఉన్నారు. కరాచీలోని కెమరి వద్ద తీరప్రాంతంలో ఉన్న గోత్ గ్రామంలో ఈ నెల 10 నుంచి 25 మధ్య 18 మంది వింత వ్యాధితో మృతి చెందారని, వీరిలో 14 మంది పిల్లలు ఉన్నారని హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ అబ్దుల్ హమీద్ జుమాని శుక్రవారం నిర్ధారించారు. వైద్య బృందం అక్కడకు చేరుకుందని, మరణాలకు గల కారణాలపై పరిశోధిస్తున్నదని, బహుశా సముద్రం, నీటికి సంబంధించి ఈ వ్యాధి సోకినట్టు భావిస్తున్నామన్నారు. వ్యాధి సోకిన వారు గొంతులో వాపుతో పాటు ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బందిపడినట్టు బాధిత కుటుంబాలు తెలిపాయి.