కేబ్బి : నైజీరియాలోని వాయవ్య రాష్ట్రం కేబ్బిలో బందిపోట్లు బీభత్సం సృష్టించారు. డాంకో-వాసాగు ప్రాంతంలో వేర్వేరు మతాలకు చెందిన 8 వర్గాలపై కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల్లో 88 మంది ప్రాణాలు కోల్పోగా మరింత కొంత మందికి గాయాలైనట్లు ఆ రాష్ట్ర పోలీసు ప్రతినిధి నఫియూ అబూబకర్ రాజధాని బిర్నిన్లో విలేకరులకు తెలిపారు. మరిన్ని దాడుల జరగనున్నట్లు సమాచారం రావడంతో ఆయా సామాజికవర్గాల ప్రజలకు భద్రత కల్పించినట్లు ఆయన వెల్లడించారు. తొలుత 66 మంది మాత్రమే మృతి చెందారని భావించామని, కానీ 88 మంది మృతి చెందినట్లు అధికారికంగా ధ్రువీకరించారు. ఘటనాస్థలం నుంచి పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గత ఏప్రిల్లోనూ బందిపోట్ల కాల్పుల్లో తొమ్మిది మంది పోలీసులు, ఇద్దరు సాధారణ పౌరులు మరణించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.