కాబూల్, జూలై 9: ఆఫ్ఘనిస్థాన్లో 85% కంటే ఎక్కువ భూభాగం తమ అధీనంలోనే ఉందని తాలిబన్ శుక్రవారం ప్రకటించుకొన్నది. దీనిపై ఆఫ్ఘన్ ప్రభుత్వం స్పందించలేదు. ఆఫ్ఘనిస్థాన్లో పరిస్థితి దిగజారిపోతున్నదని పాకిస్థాన్ ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్యుద్ధం మొదలైతే పాక్లోకి వలసలు తప్పవని, వలసలను నియంత్రించలేమని పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ హెచ్చరించారు. ఆఫ్ఘన్లో కొన్ని రోజులుగా హింస పెరగడంపై భారత్ ఆందోళన వ్యక్తంచేసింది. ‘ఎవరు గెలిచినా.. ఎవరు ఓడినా.. దేశాన్ని ఎవరు పాలించాలన్నది చట్టపరిధిలోని అంశం. చట్టం విస్మరించలేనిది అని నా అభిప్రాయం’ అని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. ఆఫ్ఘన్లో అమెరికా మిషన్ ఆగస్టు 31తో ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు.