పెట్రొపొలిస్: బ్రెజిల్లోని పెట్రొపొలిస్లో మెరుపు వరదలు సంభవించాయి. దీంతో 78 మంది మృతిచెందారు. భారీ సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. రియో డి జెనిరో రాష్ట్రంలోని పెట్రొపొలిస్ నగరాన్ని భారీవర్షాలు ముంచెత్తాయి. మూడు గంటల్లో 28.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
దీంతో నగరంలోని వీధులన్నీ నదులుగా మారాయి. వరదలతో కొండచరియలు విరిగిపడి పెద్దసంఖ్యలో ఇండ్లు నేలమట్టమయ్యాయి. దీంతో 78 మంది మరణించారు. పలువురు వరదల్లో కొట్టుకుపోయారు.
వరదల్లో గల్లంతైన వారికోసం సైనికులు, సహాయక సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 22 మందిని ప్రాణాలతో రక్షించామని వెల్లడించారు. మృతులసంఖ్య మరింత పెరిగే అవకాశముందని చెప్పారు. మూడు నెలల్లో పడాల్సిన వర్షం మూడు గంటల్లోనే కురిసిందని పేర్కొన్నారు.